షా బుఖారి బాబా ఉరుసు మహోత్సవంలో పాల్గొన్న అక్కల రామ మోహన రావు

మైలవరం: కొండపల్లి పట్టణ పరిధిలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం హజరత్ సయ్యద్ షా బుఖారి ఆస్థాన పీఠాధిపతి, షా బుఖారి బాబా నిత్యాన్నదాత అల్తాఫ్ బాబా సాదరంగా మేళతాళాలతో ఆహ్వానించి ఇస్లాం సాంప్రదాయ పద్ధతిలో ఘనంగా సత్కరించారు. అనంతరం దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మహోత్సవం అద్భుతంగా నిర్వహించారని, ఉరుసులో పాల్గొనడం తనకు లభించిన అదృష్టంగా భావిస్తున్నాను అని తెలిపారు. ఈ కార్యక్రమంలో చేరుకు మల్లీ సురేష్, అడపా శివ, యరంశెట్టి సాంబ, రామాంజనేయులు, బస్టాండ్ రాధా, బాలు, తదితరులు పాల్గొన్నారు.