కొణిదెల నాగబాబుతో రామ శ్రీనివాస్ మర్యాదపూర్వక భేటీ

రాజంపేట: అనంతపురం జిల్లా పర్యటనకు వచ్చిన జనసేన పిఏసి సభ్యులు కొణిదెల నాగబాబు ను రామ శ్రీనివాస్ మర్యాద పూర్వకంగా కలిసి రాజంపేట నియోజకవర్గ పార్టీ గురించి, మరియు ఉమ్మడి కడప జిల్లాలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల గురించి తెలియజేయడం జరిగింది. అన్ని విషయాలను పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళతానని.. ఇదే విధంగా పార్టీ బలోపేతానికి, ప్రజాసమస్యలపై, రైతాంగం తరపున పోరాటం చెయ్యమని నాగబాబు సూచించడం జరిగిందని రామ శ్రీనివాస్ తెలిపారు.