శ్రీశ్రీశ్రీ ఆంజనేయస్వామి తిరుణాల మహోత్సవంలో పాల్గొన్న రామ శ్రీనివాస్!

రాజంపేట నియోజకవర్గం: నియోజకవర్గ పరిధిలోని టి.సుండుపల్లి మండల పరిధిలో తిమ్మసముద్రం గ్రామంలో పీలేరు వెళ్ళే రోడ్డు మీద వెలసిన శ్రీశ్రీశ్రీ ఆంజనేయస్వామి తిరుణాల సందర్భంగా జనసేన పార్టీ నాయకులు రామ శ్రీనివాస్ స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దబలిజపల్లి, వేముల సోమునాద్ బాబు, ఏటీగడ్డ రాచపల్లి, రామంజులు, నాగార్జున, సామిసేనిగడ్డ హరిజనవాడ ఆంజనేయులు, సుండుపల్లి బోనంశెట్టి సుధాకర్, ఎల్లంపల్లి కాలని జయరామ్, కుప్పగుట్టపల్లి నాగలేష్ తో పాటు పలువురు స్వామి వారికి మొక్కులు చెలించుటకు చాందని బండ్లు, అన్నదాన కార్యక్రమం ఆహ్వానం మేరకు భక్తులు, స్థానిక గ్రామస్థులు, రాజకీయ నాయకులు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, బంధుమిత్రులు, మండల వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు, చుట్టు పక్కల గ్రామాల వారు భక్తి శ్రద్ధలతో చాందనిబండ్లు, చక్కభజనలు, డిజెలు, డప్పువాయిద్యాలు, బాణసంచాలతో అంగరంగ వైభవంగా విద్యుత్ దీపాలంకరణలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామస్థులు, భక్తులు, యువకులు, మహిళలు, వివిధ ప్రాంతాల నుండి, మండల వ్యాప్తంగా ప్రజలు, బంధుమిత్రులతో భారీ ఎత్తున హాజరయ్యారు.