జనసేనలో చేరిన ఆర్టీసీ విశ్రాంత ఈ.డి. ఎమ్.వి.రావు

ఏపీఎస్ఆర్టీసీలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈ.డి.) గా బాధ్యతలు నిర్వర్తించి పదవి విరమణ చేసిన ఎమ్.వెంకటేశ్వర రావు జనసేన పార్టీలో చేరారు. గురువారం ఆయన హైదరాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ సమక్షంలో చేరారు. కడప జిల్లా రాజంపేటకు చెందిన ఎమ్.వి.రావు సుదీర్ఘ కాలం ఆర్టీసీలో అధికారిగా పని చేశారు. రావు మాట్లాడుతూ ‘జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ సిద్ధాంతాలు, ఆలోచనలు ప్రజాపక్షంగా ఉన్నాయి. పార్టీకి సంబంధించిన కార్యక్రమంలో క్రియాశీలకంగా పని చేస్తాను. పార్టీ విధానాలను క్షేత్రస్థాయికి తీసుకువెళ్తాను’ అని తెలిపారు.