పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా అందజేసిన సింగరాయకొండ జనసేన

జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు.. ప్రకాశం జిల్లా అధ్యక్షులవారి సలహాల మేరకు.. ప్రకాశం జిల్లా కార్యదర్శి కొండేపి నియోజకవర్గ సమన్వయకర్త మేడా రమేష్ నాయుడు ఆధ్వర్యంలో.. సింగరాయకొండ మండల జనసేన పార్టీ తరపున పేద ముస్లిం కుటుంబాలకు స్వయంగా వారి ఇళ్ల దగ్గరికి వెళ్లి రంజాన్ తోఫా అందజేసి, వారి కుటుంబాలకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సింగరాయకొండ మండల అధ్యక్షులు ఐనా బత్తిన రాజేష్, బిట్రగుంట మండల అధ్యక్షులు శశిభూషణ్, మర్రిపూడి మండల అధ్యక్షులు చంద్రశేఖర్, వీర మహిళలు పోలిశెట్టి మాధురి, ఐనా బత్తిన రాధిక, జనసేన నాయకులు కాసుల శ్రీనివాస్, దండే ఆంజనేయులు, దేవినేని బాలాజీ, అనుముల శెట్టి కిరణ్ బాబు, గుంటుపల్లి శ్రీనివాస్, సయ్యద్ చాన్ బాషా, పోలిశెట్టి విజయ్ కుమార్, మోహన్, సి.కుమార్, షేక్ సుభాని, నరేంద్ర, షరీఫ్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.