పత్తికొండ నియోజకవర్గ కో ఆర్డినేటర్ గా నియమితులైన టీ పురుషోత్తం కు ఘన సత్కారం

పత్తికొండ నియోజకవర్గ నాయకుడు సి.జి రాజశేఖర్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ ఐ టి విభాగం, పత్తికొండ నియోజకవర్గ కో ఆర్డినేటర్ గా నియమితులైన టీ పురుషోత్తం ను పత్తికొండ నియోజకవర్గం తరపున సత్కరించడం జరిగింది.
ఈ సందర్భంగా పత్తికొండ నియోజకవర్గ నాయకుడు సి.జి రాజశేఖర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మా జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదల పవన్ కళ్యాణ్, ఐటీ విభాగం చైర్మన్ మిర్యాల శ్రీనివాస్ రాష్ట్రంలో జిల్లాల వారీగా నియోజకవర్గాలు వారిగా ఐటి విభాగంలో కోఆర్డినేటర్లు ను ఎన్నుకోవడం జరిగింది, కర్నూలు జిల్లా, పత్తికొండ నియోజకవర్గం, తరపున టి పురుషోత్తం ను ఎన్నుకున్నందుకు, జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ కు.. అలాగే పి.ఏ.సి కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కు, పి.ఏ.సి సభ్యులు నాగబాబు కు జనసేన ఐటీ విభాగం చైర్మన్ మిరియాల శ్రీనివాస్ కు మరియు కర్నూల్ జిల్లా కోఆర్డినేటర్ లక్ష్మీకాంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం, మా సోదరుడికి ఈ అవకాశం కల్పించినందుకు మేము చాలా సంతోషిస్తున్నాము, అదేవిధంగా కర్నూలు జిల్లాలో పత్తికొండ నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ ఐటి విభాగంలో అవకాశం చోటు సంపాదించుకున్న మా సోదరుడు టీ పురుషోత్తం గారికి మా హృదయపూర్వక అభినందనలు శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా ఐటి విభాగం సభ్యులందరూ జనసేన పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి వీళ్ళ శక్తి మేర పని చేస్తారని, అలాగే ఎలక్షన్లు ఎప్పుడు వచ్చినా జనసేన పార్టీ విజయం కోసం వీరంతా కష్టపడ్డారని.. జనసేన పార్టీ విజయం సాధించే విధంగా వీరందరూ కృషి చేస్తారని, రాబోయే కాలం జనసేన పార్టీదే అధికారమని తెలియజేశారు. అలాగే కర్నూలు జిల్లాలో ఉన్న మిగతా 13 నియోజకవర్గ కో ఆర్డినేటర్ లకు ,మా హృదయపూర్వక అభినందనలు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సత్కారం లో పాల్గొన్న జనసేన పార్టీ నాయకులు ఇస్మాయిల్, ధర్మతేజ, జానీ, ఎర్రి స్వామి, అనిల్ మరియు తదితరులు పాల్గొన్నారు.