ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన

ఇచ్చాపురం, సంఘ సేవకులు, ఇచ్చాపురం బ్లడ్ బ్యాంక్ గా పేరొందిన జనసేన రాష్ట్ర జాయింట్ సెక్రటరీ తిప్పన దుర్యోధన రెడ్డి పుట్టినరోజు సందర్భంగా స్థానిక మండపల్లిలో శనివారం శ్రీకాకుళం మెడికవర్ హాస్పటల్ వారి సహకారంతో సంబ వామి, ఆత్మీయ, గులాబీ దళం సేవా సంఘాల అధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ప్రాణదాత సేవా సంఘ సహకారంతో రక్తదాన శిబిరం నిర్వహించారు. సుమారు 200 మంది పేదలకు మెడికవర్ వైద్యలు పర్యవేక్షించి, వాటికి సంబంధించి మందులను ఉచితంగా అందజేశారు. 30 మంది రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ప్రతినిధి పిట్ట మామయ్య, ఎంపీటీసీ తరణి బెహీరా, యువ సూర్య రాంబాబు, కోట రామారావు, మెరుగు పరేమేష్ తదితరులు పాల్గొన్నారు.