పాలకొండ నియోజకవర్గంలో జనసేన ఆత్మీయ సమావేశం

పాలకొండ నియోజకవర్గం, సీతంపేట మండలం కుశిమి, శంబం, మల్లి, ఇసకగెడ్డ మరియు దారిమల్లి గ్రామస్థానికులతో ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాలకొండ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు గర్బాన సత్తిబాబు మాట్లాడుతూ పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లే దిశగా జనసైనికులు పనిచేయాలి అని తెలియజేసారు. అక్కడ ఉండే త్రాగునీటి బావిని పరిశీలించి, బావి మరమత్తుల కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతాం అని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తోటి జనసైనికులు పాల్గొన్నారు.