దక్షిణ నియోజకవర్గ నాయకులు జికె ఆధ్వర్యంలో శ్రీకనకదుర్గ ఆలయానికి స్టెయిన్లెస్ స్టీల్ రైలింగ్

విశాఖపట్నం, దక్షిణ నియోజకవర్గం, 33వ వార్డు ఎం.జి.ఎం హైస్కూల్ వద్దనున్న శ్రీ కనకదుర్గ ఆలయానికి స్టెయిన్లెస్ స్టీల్ రైలింగ్ మరియు గేట్లను జికె ఫౌండేషన్ చైర్మన్, జనసేన పార్టీ దక్షిణ నియోజకవర్గ నాయకులు గోపికృష్ణ (జికె) సుమారు లక్ష (1,00,000/-) రూపాయల సొంత నిధుల వ్యయంతో ఈ నిర్మాణ పనులను చేయించడం జరిగింది. జనసేన పార్టీ ఫ్లోర్ లీడర్, స్థానిక 33వ వార్డు కార్పొరేటర్ భీశెట్టి వసంత లక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొని శ్రీ కనకదుర్గ అమ్మవారికి విశిష్ట పూజలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వీర మహిళలు, జనసైనికులు మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.