గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సుంకెట మహేష్

భైంసా పట్టణంలోని నిర్మల్ చౌరస్తా దగ్గర సబ్ మర్సిబుల్ మెకానిక్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణతంత్ర వేడుకలు నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జనసేన పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నాయకులు సుంకెట మహేష్ బాబు మాట్లాడుతూ దేశ స్వతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన ఎందరో మహనీయులను గుర్తు చేస్తూ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ దేశంలో జీవించడానికి హక్కు కల్పించిన భారత రాజ్యాంగాన్ని ఇచ్చిన గొప్ప మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అదేవిధంగా మనకు ఓటు అనే ఆయుధాన్ని ఇవ్వడం వల్ల స్వచ్ఛమైన నాయకత్వాన్ని ఎన్నుకోవడానికి ఒక వజ్రాయుధాన్ని ఇచ్చినటువంటి రాజ్యాంగానికి ఈ సమాజంలో వున్న ప్రతి ఒక్కరు ఆ రాజ్యాంగానికి కుల మత వర్గ విభేదాలు తేడా లేకుండా రాజ్యాంగానికి లోబడి ఉండాలని గుర్తు చేస్తూ రాజ్యాంగాన్ని కాపాడడానికి యువత ముందుండాలని తెలియజేస్తూ భవిష్యత్ లో దేశం గర్వించదగ్గ మనమందరం కలిసి ఒకటిగా ఉండడానికి ఈ వేదిక నుండి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు కృష్ణ ఫారుక్ నాగేష్ దశరథ్ తదితరులు పాల్గొన్నారు.