మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో తాడికొండ మండల కార్యవర్గ సమావేశం

తాడికొండ మండల అధ్యక్షులు గులకవరపు నరేష్ ఆధ్వర్యంలో మండల కమిటీ సభ్యుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో పార్టీని బలోపేతం చేయడానికి చేయవలసిన కార్యక్రమలపై చర్చించడం జరిగింది. అలాగే గ్రామాలలో జనసైనికులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి వారికి అండగా ఉండే విషయంపై తీర్మానం చేయడం జరిగింది. అలాగే పార్టీలో యువత, మహిళల భగస్వామ్యం ఇంకా పెరగాలని సభ్యులకు సూచించారు. నూతనంగా నియమించిన కార్యవర్గ సభ్యులకి నియామకపత్రాలు అందించారు. గ్రామాలలో పార్టీ కార్యక్రమాల బాధ్యత కమిటీ సభ్యులు తీసుకోవాలి అని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షలు బి వెంకటరావు, ఆర్ వీరేంద్ర మరియు ఇతర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.