మడకశిర నియోజకవర్గంలో పర్యటించిన టి.సి వరుణ్

మడకశిర, అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా మడకశిర నియోజకవర్గం అనంతపురం జిల్లా అధ్యక్షులు టి.సి వరుణ్ పర్యటించడం జరిగింది. మడకశిర ప్రాంతంలోని పలు సమస్యలపై పోరాటాలు కొనసాగిస్తామని తెలిపారు. మడకశిర పట్టణంలో అంబేద్కర్ విగ్రహానికి జనసేన నాయకులు పూలమాలలు వేసి అనంతరంఅంబేద్కర్ సర్కిల్ నుండి వైయస్సార్ సర్కిల్ మీదుగాపెనుగొండ రోడ్డు జిమ్ సెంటర్ వద్ద బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు టి సి వరుణ్ మాట్లాడుతూ నియోజకవర్గంలోనే రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉందని ఇప్పటికీ హంద్రీనీవా కాలువ పూర్తికాక రొల్ల, అగిలి, చెరువులకు నీరు చేరలేదని నియోజకవర్గంలోని అభివృద్ధి పనులు చేయాలని ప్రభుత్వాన్ని విమర్శించారు. ఈ ప్రాంతం నుండి మంత్రులు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు అయినప్పటికీ నియోజక అభివృద్ధి మాత్రం శూన్యం అని తెలిపారు. అనంతపురం జిల్లాలోనే అత్యధికంగా వెనుకబడిన ప్రాంతం మడకసిరా అని తెలియజేసారు అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేసి మోసపోయారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ అని తెలియజేశారు. ఇప్పటినుంచి నియోజకవర్గం వచ్చి పార్టీ అభివృద్ధికై పర్యటించినట్లు ఆయన తెలిపారు అంతేకాకుండా ఈ ప్రాంతంలో జనసేన పార్టీ నాయకులను అధికార పార్టీ నాయకులు బెదిరిస్తున్నారని మండిపడ్డారు. బెదిరిస్తే భయపడేది లేదని రోడ్డులోకి వచ్చి గట్టిగా సమాధానం ఇస్తామని వైకాపా పార్టీని హెచ్చరించారు జనసేన పార్టీ నాయకులకు పార్టీ అధినేత అండగా ఉంటాడని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు టి.సి వరుణ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కే.నాగేంద్ర, జిల్లా ఉపాధ్యక్షులు అంకె ఈశ్వరయ్య, జిల్లా సభ్యులు కిరణ్ జిల్లా సంయుక్త కార్యదర్శి ఆనంద్ కృష్ణ, మడకశిర నియోజకవర్గ మండల అధ్యక్షులు టి.ఏ శివాజీ, రొల్ల మండల రంగస్వామి, అగిలి మండలం భాను ప్రకాష్, గుడిబండ మండలం మంజునాథ్, మండల కమిటీ సభ్యులు నియోజకవర్గంలో ఉన్న జనసైనికులు అందరూ తదితరులు పాల్గొనడం జరిగింది.