ఉపాధ్యాయ సంఘ నాయకులను వెంటనే విడుదల చేయాలి: ఎస్ వి బాబు సమ్మెట

కృష్ణా జిల్లా, పెడన, రాజ్యాంగబద్ధంగా నిరసన తెలియజేస్తున్న ఉపాధ్యాయులను, ఉపాధ్యాయ సంఘ నాయకులను అరెస్టు చేయడం అప్రజాస్వామ్యమని… ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రగల్బాలు పలికిన జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక మాట తప్పారని, తాను ముఖ్యమంత్రి అయితే వారంలో సిపిఎస్ రద్దు చేస్తారని, పిఆర్సి సవరణ ఉంటుందని, డిఏ లను సకాలంలో చెల్లిస్తానని నమ్మబలికి, తీరా ముఖ్యమంత్రి అయ్యాక తమకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తున్న ఉద్యోగులను ఉద్యోగ సంఘ నాయకులను అక్రమ అరెస్టులతో గొంతు నొక్కుతున్నారని, అరెస్టు చేసిన ఉపాధ్యాయ నాయకులు వెంటనే విడుదల చేయాలి, వారి న్యాయమైన కోర్కెలను తీర్చాలని జనసేన పార్టీ డిమాండ్ చేస్తుందని ఎస్ వి బాబు సమ్మెట అన్నారు.