వరద బాధితులకు సహాయంలో తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలం: పితాని

  • వరద ముంపు ప్రాంతాలలో పితాని పర్యటన..

కోనసీమ జిల్లా, ముమ్మిడివరం నియోజవర్గం: ముమ్మిడివరం మండలం, పొడి తిప్ప వలసల తిప్ప చేరులంక గ్రామంలో గోదావరి వరద ఉదృతకు గురైన గ్రామాలను, పంటలను పరిశీలించి జనసేన మమ్మిడివరం నియోజవర్గం ఇంచార్జ్ పితాని బాలకృష్ణ గ్రామంలో వారి ఇళ్ల వద్దకెళ్లి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకుని, వారికి ఏవిధమైన సహాయమైనా అందినదా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా పితాని బాలకృష్ణ మాట్లాడుతూ.

రెండు తెలుగు రాష్ట్రాలు ప్రభుత్వాలు వరద బాధితులకు సహాయంలో పూర్తిగా విఫలం అయ్యాయని బాలకృష్ణ అన్నారు.

గ్రామాల్లో వరద బారిన పడిన కుటుంబాలకు ప్రభుత్వం 2000 రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించింది.. కానీ అవి సరిపోవని, పది నుంచి పదిహేను వేలు ఇస్తే సరిపోతుందని ఆయన అన్నారు.

వరద ముంపుకు గురైన కొంత మంది నిరుపేదలకు కొండేపూడి మల్లయ్య కు రెండు వేల రూపాయలు, సుంకర యేసు బాబు కు వెయ్యి రూపాయలు, సలాది శ్రీరాములు కు 500, గొల్లపల్లి నాగమ్మ కు 500, పాము ఈశ్వరరావు కు 500, ఉమా కు 500 రూపాయల ఆర్థిక సాయం అందజేశారు.

రైతులు పూర్తిగా నష్టపోయారని రైతులను వెంటనే ఆదుకోవాలని అన్నారు.