ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు

* రాజనీతిజ్ఞుడు శ్రీ రాంనాథ్ కోవింద్
రాష్ట్రపతిగా పదవీ విరమణ చేయనున్న గౌరవనీయులు రాంనాథ్ కోవింద్ గారి వీడ్కోలు సందర్భంగా ఈ నెల 22న ఢిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి తనను ఆహ్వానించిన గౌరవ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారికి, కేంద్ర హోమ్ మరియు సహకార శాఖామాత్యులు అమిత్ షా గారికి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తప్పనిసరిగా హాజరుకావాల్సిన ఈ చారిత్రాత్మక సభకు ఆరోగ్య కారణాల దృష్ట్యా వెళ్లలేకపోతున్నందుకు చింతిస్తున్నాను. నిష్కళంకుడైన శ్రీ రాంనాథ్ కోవింద్ గారు తన అయిదేళ్ల పదవీకాలంలో ఎటువంటి పొరపొచ్చాలకు తావు లేకుండా రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వర్తించడం ఆయనలోని రాజనీతిజ్ఞతకు నిదర్శనం. ఆయన తన సేవలను అజరామరంగా నిర్వర్తించాలని, ఆ భగవంతుడు ఆయనకు సంపూర్ణ ఆరోగ్య ఆనందాలను ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని పవన్ కళ్యాణ్ తెలిపారు.