శ్రీ వెంకటేశ్వర స్వామి తిరణాలలో పాల్గొన్న గాదె

పెదకూరపాడు నియోజకవర్గం, అమరావతి మండలం, మల్లాది గ్రామంలో స్వయంభు వటవృక్షాంతర్గత శ్రీ వెంకటేశ్వర స్వామి 46వ తిరణాల సందర్భంగా మల్లాది గ్రామ జనసేన పార్టీ నాయకులు కోటి వెనకటసుబ్బయ్య, బతినేని యలమందయ్యా, చల్లా కోటి ల ఆహ్వానం మేరకు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు విచ్చేసి దేవుని దర్శనం చేసుకోవడం మరియు తిరణాలలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు అడపా మాణిక్యాలరావు, నారదాసు రామచంద్ర ప్రసాద్, శిఖా బాలు, మధు లాల్, మండల అధ్యక్షులు వాకా అఖిల్, శివ నాగేశ్వరరావు, భద్ర, వెంకట చలపతిరావు, కొల రమణ, కొల శ్రీనివాసరావు, రాయి. సత్యనారాయణ, నాగ శేషు, రవి, సాయి నాయకులు మరియు కర్యకర్తలు పాల్గొన్నారు.