మేకపాటి గౌతమ్ రెడ్డి మరణం మర్రిపాడుమండల ప్రజానానికి తీరని లోటు

*మర్రిపాడు మండల జనసేన పార్టీ అధ్యక్షురాలు ప్రమీల

రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, వాణిజ్యం, జౌళి, నైపుణ్యాభివృద్ధి శిక్షణ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి హఠాన్మరణంపై మర్రిపాడు మండల జనసేన పార్టీ అధ్యక్షురాలు ప్రమీల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మర్రిపాడు మండల కేంద్రంలో స్థానిక జనసేన నాయకులతో కలిసి గౌతమ్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మంత్రిగా ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ రెండు నిమిషాలు మౌనం పాటించారు ఈ సందర్భంగా మర్రిపాడు మండల. నాయకులు చిన్నా జనసేన మాట్లాడుతూ మంత్రి గౌతమ్ రెడ్డి చిన్న వయసులోనే గుండెపోటుతో మృతి చెందడం బాధాకరమన్నారు ఆయన పరిశ్రమల శాఖా మంత్రిగా తనదైన శైలిలో చురుకుగా పనిచేస్తూ పెట్టుబడుల ఆకర్షణలో తన మార్క్ చూపిస్తూ ముందుకు సాగారని నైపుణ్యాభివృద్ధి శిక్షణశాఖపై ప్రత్యేక శ్రద్ధ చూపేవారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మర్రిపాడు మండల అధ్యక్షురాలు ప్రమీల, మండల ఉపాధ్యక్షుడు ఉదయ్, మర్రిపాడుమండల నాయకులు
చిన్నా జనసేన తదితరులు పాల్గొన్నారు.