ఫ్లోరైడ్ విముక్త పోరాట నాయకుడు శ్రీ అంశాల స్వామి మరణం బాధాకరం

ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ ప్రభావం నుంచి తమ ప్రాంతాన్ని విముక్తం చేయాలంటూ సుదీర్ఘ పోరాటం చేసిన శ్రీ అంశాల స్వామి గారు మరణం బాధాకరమని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో సంతాపం వ్యక్తం చేశారు. మూడు దశాబ్దాల కాలం రాజీ లేని పోరాటం చేశారు. స్వయంగా ఫ్లోరోసిస్ బాధితుడైనా ఆత్మ విశ్వాసం కోల్పోకుండా తన లాంటి బాధిత ప్రజల పక్షాన సొంత ప్రాంతం నుంచే పోరు మొదలుపెట్టి జాతీయ స్థాయిలో గళం వినిపించారు. శ్రీ స్వామి గారు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఆయన కుటుంబానికి నా తరఫున, జనసేన పక్షాన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.