జనసేవలో జనసైనికులు ఎప్పుడు అండగానే ఉంటారు

పాలకొండ పట్టణంలో ఇటీవలే ప్రియాంక అనే యువతి (ముగ్గురు పిల్లల)తల్లి కుటుంబ సమస్యలు వలన ఆత్మహత్య చేసుకొంది. దీనితో అనాదలు అయిన ముగ్గురు పసి పిల్లలకి అండగా అలుబిల్లి రాజేష్ కుమార్ మరియు ఎంపీటీసీ అంపిలి విక్రమ్ ఆధ్వర్యంలో తమ కుటుంబానికి కొంత నగదు మరియు ఇంటికి కావాల్సిన వస్తువులు ఇచ్చి భవిష్యత్తులో పిల్లలకు విద్య, వైద్య, వసతి జనసేవ ట్రస్ట్ ద్వారా అందిస్తామని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంతోష్ నాయుడు, గడే కిషోర్, మోహన్ హాజరయ్యారు.