విద్యార్థుల ఎంపిక ప్రక్రియ వారి తల్లిదండ్రుల మద్యే జరగాలి

నెల్లిమర్ల ఏపి మోడల్ స్కూల్లో 6వ తరగతి విద్యార్థుల ఎంపిక ప్రక్రియ రాజకీయ నాయకుల మధ్య కాకుండా ఆ విద్యార్థుల తల్లిదండ్రులు మద్య జరిగేలా చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ తరపున కలెక్టర్ కి వినతిపత్రం అందజేయడం జరిగింది. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్వి, మత్స్యకార కార్యదర్శి కర్రి అప్పలరాజు, నెల్లిమర్ల నియోజకవర్గ క్రీయాశీలక కార్యకర్తలు పల్ల రాంబాబు, జయేష్ కావుంగల్, పైల శంకర్, గుడివాడ జమ్మరాజు, డాక్టర్ మురళీ, దుర్గాశి శేఖర్ పాల్గొనడం జరిగింది.