ప్రవాస భారతీయులు జనసేనకు చేస్తున్న సేవలు అభినందనీయం
* జనసేన పీఏసీ సభ్యుడు శ్రీ కొణిదెల నాగబాబు
* జనసేన “కౌలు రైతు భరోసా”కు రూ. 3 లక్షల విరాళం అందజేసిన సింగపూర్ ప్రవాస భారతీయులు
జనసేన పార్టీ ఎదుగుదల కోసం ప్రవాస భారతీయులు చేస్తున్న స్వచ్ఛంద సేవలు అభినందనీయమని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు శ్రీ కొణిదెల నాగబాబు గారు స్పష్టం చేశారు. సింగపూర్లో స్థిరపడిన ప్రవాస భారతీయులు కౌలు రైతు భరోసా సహాయార్థం సమకూర్చిన రూ. 3 లక్షలు విరాళాన్ని డి.డి రూపంలో శ్రీ నాగబాబు గారి చేతుల మీదుగా జనసేన పార్టీకి అందజేశారు శ్రీదత్ గారు, సుబ్బారావు , కమల . బుధవారం హైదరాబాద్ జనసేన కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీ నాగబాబు గారు మాట్లాడుతూ.. ప్రవాస భారతీయులు సుదూర ప్రాంతాల్లో ఉంటున్నప్పటికీ మాతృభూమిపై మక్కువతో సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందననీయమని అన్నారు. జనసేన ఆవిర్భావం నుంచి పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ, జనసైనికులు, వీర మహిళలు చేస్తున్న కార్యక్రమాలకు వెన్నుదన్నుగా ఉండి ప్రోత్సహిస్తున్నారని పేర్కొన్నారు. ప్రవాస భారతీయుల సేవలను జనసేన ఎప్పటికీ మరవదని, జనసేన గెలుపులో ప్రవాస భారతీయుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాజకీయ కార్యదర్శి శ్రీ పి. హరిప్రసాద్ , జనసేన పార్టీ కోశాధికారి ఎ.వి. రత్నం పాల్గొన్నారు.