టోక్యో పారాలింపిక్స్.. సిల్వర్ మెడల్ సాధించిన ప్రవీణ్ కుమార్

టోక్యో పారాలింపిక్స్‌లో భారత్ ఖాతాలోకి మరో పతకం వచ్చి చేరింది. పురుషుల హైజంప్‌ పోటీల్లో అథ్లెట్ ప్రవీణ్ కుమార్ 2.07 మీటర్ల ఎత్తు జంప్ చేసి సిల్వర్ మెడల్ సాధించాడు. హైజంప్‌లో భారత్‌కు ఇది నాలుగో పధకం కాగా, ఇంతకముందు మరియప్పన్, నిషద్, శరద్ పతకాలు సాధించారు. ఇక మన ఖాతాలో మొత్తం 11 పతకాలు ఉన్నాయి. వాటిల్లో 2 గోల్డ్, 6 సిల్వర్, 3 బ్రాంజ్ ఉన్నాయి.