జనసైనికుడు విష్ణుమొలకల శ్రీనివాసరావు కు శ్రద్ధాంజలి

జనసేన పార్టీ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటూ పార్టీ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేసిన గుంటూరు జిల్లా, వేమూరు మండలం, వేమూరు నియోజకవర్గం, చావలి గ్రామానికి చెందిన జనసైనికుడు శ్రీ విష్ణుమొలకల శ్రీనివాసరావు మరణించారు. రోజువారి వృత్తి అనంతరం ఇంటికి బయలుదేరిన మన జన సైనికుడు విష్ణుమొలకల శ్రీనివాసరావు ప్రమాదవశాత్తు కుక్క అడ్డం వచ్చే సరికి ఆ కుక్కని తప్పించబోయి బైకు స్కిడ్ అయ్యి.. కింద పడే సరికి తలకి బలమైన దెబ్బ తగలడం వలన ప్రాణాలు కోల్పోయారు.. జనసేన పార్టీ తరపున వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ.. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేయడం జరిగింది.