బంగారు రామదాసు ఆధ్వర్యంలో మహాత్మా గాంధీకి ఘననివాళి

అల్లూరి సీతారామరాజు జిల్లా, అరకు నియోజకవర్గంలో డుంబ్రిగుడ మండలము, పోతాంగి పంచాయితీ పరిధిలో చెందిన పణశపుట్టు గ్రామంలో జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ఆయనకు జనసేన నాయకులు ఘన నివాళులు అర్పిస్తూ.. అరకు నియోజకవర్గం నాయకులు బంగారు రామదాసు మాట్లాడుతూ ఏజెన్సీ గిరిజన ప్రాంతంలో స్వాతంత్రం వచ్చి ఇప్పటివరకు దాదాపు 76వ సంవత్సరములు అయినప్పటికీ కూడాఏజెన్సీ గిరిజన ప్రాంతము ఇప్పటివరకు అభివృద్ధి చెందలేదని.. ప్రభుత్వము తక్షణమే స్పందించి గ్రామాలకు పంచాయతీలకు నిధులు కేటాయించాలని పంచాయతీ నిధుల ద్వారా గ్రామాలకు సిసి రోడ్లు బీట్ రోడ్లు వేయించాలని.. అలాగే మంచినీటి సౌకర్యం కూడా కల్పించాలని ఈ సందర్భంగా జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు బంగారు రాందాస్ డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసైనికులు గ్రామస్తులు తదితరులు పాల్గొనడం జరిగింది.