జనసేన పార్టీ కార్యాలయాల్లో సంప్రదాయరీతిలో ఉగాది వేడుకలు
శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది వేడుకలు హైదరాబాద్ జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరి పార్టీ రాష్ట్ర కార్యాలయాల్లో సంప్రదాయరీతిలో జరిగాయి. కేంద్ర కార్యాలయంలో జరిగిన వేడుకల్లో పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్, పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. వేద పండితులు ప్రత్యేక పూజల అనంతరం పవన్ కళ్యాణ్ గారికి ఆశీర్వచనాలు అందించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఉపాధ్యక్షులు శ్రీ బి. మహేందర్ రెడ్డి, పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జు నేమూరి శంకర్ గౌడ్, పార్టీ కోశాధికారి శ్రీ ఎ.వి.రత్నం, నాయకులు షేక్ రియాజ్, రామ్ తాళ్లూరి, వై.నగేష్, పార్టీ హైదరాబాద్ నగర అధ్యక్షుడు రాజలింగం తోపాటు జనసైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి పవన్ కళ్యాణ్ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.