వైసీపీ పాలనలో గుంటలలో రోడ్లను వెతుక్కోవాల్సిన దుస్థితి దాపురించింది: నలిశెట్టి శ్రీధర్

నెల్లూరు జిల్లా: జనసేనాని పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా రహదారుల అద్వాన పరిస్థితులను తెలియజేస్తూ.. గాఢ నిద్రలో మునిగి తేలుతున్న ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర రహదారుల అద్వాన స్థితిని తెలియజేసేందుకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న GoodMorningCMSir కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లా, ఆత్మకూరు నియోజకవర్గ ఇంచార్జ్ నలిశెట్టి శ్రీధర్ ఆధ్వర్యంలో చేజర్ల మండలంలోని గ్రామాలను పర్యటించి.. దెబ్బతిన్న రహదారులకు సంబంధించిన వివరములు తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నలిశెట్టి శ్రీధర్ మాట్లాడుతూ సాధారణంగా రోడ్లపై ఒకటి అర గుంటలు సహజమని, కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వ పాలనలో గుంటలలో రోడ్లను వెతుక్కోవాల్సిన దుస్థితి దాపురించిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చేజర్ల మండల జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది.