వాసంశెట్టి మహాలక్ష్మికి మిధిల్ కుమార్ జైన్ ఆధ్వర్యంలో జనసేన సహాయం

రామచంద్రపురం: 7 వ వార్డు వాసంశెట్టి మహాలక్ష్మి 13 సంవత్సరాల పాప ఇటీవల మరణించడం తో రామచంద్రపురం పట్టణ జనసేన పార్టీ యూత్ అధ్యక్షులు మిధిల్ కుమార్ జైన్ ఆధ్వర్యంలో ఆ కుటుంబాన్ని కలసి 25 క్గ్ల బియ్యం 2 నెలలకు సరిపడా నిత్యవసర వస్తువులు కూరగాయలు వారికి అందజేయడం జరిగింది. ఈ సహకారం అందించిన పట్టణ యూత్ అధ్యక్షులు మిధిల్ కుమార్ జైన్ కి రామచంద్రపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ హృదయపూర్వక అభినందనలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వెంకటేష్, చిన్నా, పండు, ప్రసాద్, విల్లా కార్తీక్, అల్లం నాగు, మారోజు నగేష్, రాంబాబు, చందు, ఆదిత్య, బాబీ తదితర జనసైనికులు పాల్గొన్నారు.