వట్టి వసంతకుమార్ మద్దతు మరచిపోలేనిది

మాజీ మంత్రి వట్టి వసంతకుమార్ తుది శ్వాస విడిచారని తెలిసి దిగ్భ్రాంతికి లోనయ్యానంటూ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. పంజా సాయిధరమ్ తేజ్ ద్వారా శ్రీ వసంతకుమార్ గారితో బంధుత్వం కూడా ఉంది. పోరాట యాత్ర సందర్భంలో ఆయనతో భేటీ అయ్యాను. ఆ తరవాత పలు సందర్భాల్లో చర్చిస్తూ ఉండేవాణ్ణి. ఎంతో ప్రోత్సాహకరంగా సానుకూల దృక్పథంతో మాట్లాడేవారు. రాజకీయంగా నా పురోగతిని ఆకాంక్షించారు. జనసేన పార్టీకి విరాళం ఇచ్చిన మొదటి నాయకుడు ఆయన. శ్రీ వసంతకుమార్ గారు అందించిన మద్దతు మరచిపోలేనిది. వారి కుటుంబానికి నా తరఫున, జనసేన పక్షాన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానని శ్రీ పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.