పితానిని సన్మానించిన కోప్పిగుంట గ్రామస్థులు

ముమ్మిడివరం, కాట్రేనికోన మండలం కోప్పిగుంట గ్రామానికి చెందిన శెట్టిబలిజ సంఘ పెద్దలు, గ్రామస్థులు దసరా పండుగ సందర్భంగా రాష్ట్ర జనసేన పార్టీ పీఏసీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పితాని బాలకృష్ణని ఆహ్వానించి ఆయనకి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో యనమదల మహేశ్వర రావు, వనచర్ల నాగేశ్వరరావు, చొల్లంగి సత్తిబాబు, రెడ్డి మూర్తి, మట్టపర్తి శంకరం, పిచ్చెట్టి వీర వెంకట సత్యనారాయణ, దొమ్మేటి రాధాకృష్ణ, మట్టపర్తి జగదీష్ తదితరులు పాల్గొన్నారు.