విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు డిజిటల్ క్యాంపెయిన్ మన బాధ్యత: కీర్తన

చిత్తూరు జిల్లా, జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాన్ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు కార్యక్రమంలో భాగంగా ఈ నెల 18, 19, 20 తేదీల్లో ఆంధ్ర రాష్ట్ర గళం ఢిల్లీకి వినపించాలని అందులో భాగంగా ఆంధ్ర రాష్ట్ర ఎంపిల బాధ్యత గుర్తుచేసేలా నియోజకవర్గాల ఎంపిలను టాగ్ చేస్తూ మన గళం వినిపించాలని పిలుపునిచ్చారు. దీనికి సంబంధించి కొన్ని హాష్ టాగ్స్ ను కూడా విడుదల చేయడం జరిగింది. జనసేనాని తలపెట్టిన ఈ డిజిటల్ క్యాంపెయిన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం మనందరి బాధ్యత అని చిత్తూరు జిల్లా జనసేన పార్టి జాయింట్ సెక్రటరి కీర్తన పిలుపునిచ్చారు.