గాజువాక నియోజకవర్గం 64వ వార్డులో బోరు బాగుచేయించిన వార్డు కార్పొరేటర్ శ్రీ దల్లి గోవిందరెడ్డి

గాజువాక, తేదీ 31.12.2021. గాజువాక నియోజకవర్గం 64వ వార్డు గంగవరం, జాలారి పల్లి పాలెం గ్రామంలో మోదు పెంటారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చాలా రోజుల నుండి మంచినీళ్లు బోరు మూత పడిందని 64వ వార్డు కార్పొరేటర్ శ్రీ దల్లి గోవిందరెడ్డికి ఫిర్యాదు చేయగా సమస్య చెప్పిన 24 గంటల్లోనే పరిష్కారం అయ్యింది. మహిళలు, కార్పొరేటర్ గోవింద్ రెడ్డికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేశారు. మరియు గంగవరం జనసేన నాయకులకు, ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెంటయ్య, బంగార్రాజు, గుర్రన్న, రాము, జనసేన నాయకులు విశాఖపట్నం జిల్లా మాజీ పార్లమెంట్ అధికార ప్రతినిధి చోడి పిల్లి ముసలయ్య తదితరులు పాల్గొన్నారు.