నిబద్దత గల ప్రతి కార్యకర్తను కాపాడుకుంటాం : గాదె వెంకటేశ్వరరావు

  • 50 వేల రూపాయల ఇన్సూరెన్స్ చెక్ ను అందజేసిన గాదె

గురజాల, కష్టనష్టాలకోర్చి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయ సాధన కోసం నిరంతరం పనిచేస్తున్న జనసైనికులకు అండగా ఉంటానని గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె అన్నారు. గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల జనసైనికుడు క్రియాశీలక కార్యకర్తయిన క్రోసూరి శ్రీకాంత్ ఇటీవల ద్విచక్రవాహనం ప్రమాదానికి గురై భుజానికి తీవ్ర గాయమైంది. విషయం తెలుసుకున్న జిల్లా అధ్యక్షులు వెంటనే కేంద్ర కార్యాలయానికి సమాచారం అందించి ఇన్సూరెన్స్ చెక్ త్వరగా వచ్చేలా కృషి చేయడం జరిగింది. శనివారం జిల్లా అధ్యక్షులు చేతుల మీదుగా క్రోసూరి శ్రీకాంత్ కు 50 వేల రూపాయల చెక్ ను అందజేశారు. వారికి పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి నారదాసు ప్రసాద్, జిల్లా మీడియా అధికారప్రతినిధి తవిటి భావన్నారాయనణ, జిల్లా కార్యదర్శిలు అంబటి మల్లి, కాశిం, నియోజకవర్గ ఐటీ కోఆర్డినేటర్ మునగా వెంకట్, మండల అధ్యక్షుడు కామిశెట్టి రమేష్, దాచేపల్లి మండల అధ్యక్షుడు మండపాటి దుర్గారావు, తోట నరసయ్య, మాజీ సర్పంచ్ ద్రోణాదుల అంకారావు, సిరిగిరి మణికంఠ జన సైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.