నందలూరులో వరదబాదితులకు సాయమందించిన పశ్చిమగోదావరి జనసేన

రాజంపేట నియోజకవర్గం, చేయ్యేరు వరదల వల్ల సర్వం కొల్పయిన నియోజకవర్గ ప్రజలకు అండగా పశ్చిమగోదావరి జిల్లా జనసైనికులు దాదాపు 12 లక్షల రూపాయల విలువ చేసే నిత్యావసర సరుకులు అందివ్వడం జరిగింది.

ఆ నిత్యావసర సరుకులను శుక్రవారం నందలూరు జనసైనికులు కలిసి ఎర్రిపాయపల్లి, పాటూరులో నందలూరు జనసేన నాయకులు ప్రశాంత్ తిప్పాయపల్లి, సుబ్బూ, సాయి మరియు తన అంగవైకల్యాన్ని కూడా లెక్క చేయని జాకీర్ అందివ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి జనసేన నాయకుడు నాగ ఆర్య, ఈశ్వర్, ఉపేంద్ర, మంకు వెంకటేశ్, ప్రవీణ్, శివ శంకర్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే రాజంపేట నియోజకవర్గ ప్రజలకు కష్టకాలంలో తొడుగా వున్న పశ్చిమగోదావరి జిల్లా జనసైనికులకు ప్రత్యేక కృతజ్ఞతలు.