టి.శివశంకర్ శీఘ్రగతిన కోలుకోవాలి

జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, అంబేద్కర్ భావజాలాన్ని సంపూర్ణంగా అవగతం చేసుకున్న శ్రీ తమ్మిరెడ్డి శివశంకర్ గారు అస్వస్థతకు గురయ్యారని తెలిసి కలత చెందానని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో తెలిపారు. జనసేన సిద్ధాంతాలను తన వాద పటిమతో చర్చా వేదికలు, ప్రసంగాల ద్వారా బలంగా వినిపించే శ్రీ శివశంకర్ గారు సంపూర్ణంగా కోలుకుని ఎప్పటిలాగే దైనందిన, పార్టీ కార్యక్రమాలలో పాల్గొంటారని విశ్వసిస్తున్నాను. ఈ రోజున ఆయనకు జరుగుతున్న ఆపరేషన్ విజయవంతం కావాలని, ఆయనకు సంపూర్ణ ఆయుష్షును ఆ భగవంతుడు ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నానని జనసేనాని పేర్కొన్నారు.