‘జనవాణి’ తో జనం చెంతకు జనసేనాని!

జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ జులై 3వ తేదీ విజయవాడలో ‘జనవాణి’ కార్యక్రమం నిర్వహించనున్నారు. ప్రజల వినతులు స్వీకరించనున్నారు. వారి సమస్యల పరిష్కారానికి పాటు పడనున్నారు. ప్రజల గోడు వినే సంప్రదాయానికి ముఖ్యమంత్రి శ్రీ జగన్ తిలోదాకాలిచ్చిన నేపథ్యంలో శ్రీ పవన్ కళ్యాణ్ కార్యక్రమం ప్రాధాన్యం సంతరించుకుంది.