క్యాథలిక్ క్రైస్తవుల అత్యున్నత మత గురువు పోప్ ఫ్రాన్సిస్ తుది శ్వాస విడిచారని తెలిసి చింతించానని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో తెలిపారు. క్రీస్తుయందు నిదురించిన పోప్ ఫ్రాన్సిస్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. ప్రజల పోప్ గా గుర్తింపు పొందిన పోప్ ఫ్రాన్సిస్ గారు ప్రపంచ దేశాలకు – వలసదారులు, శరణార్థుల పట్ల మానవత్వంతో వ్యవహరించాలని సందేశం ఇచ్చారు. సందేశం ఇవ్వడంతోపాటు- శరణార్థుల కాళ్ళు కడిగి ఆచరణలో చూపిన విధానాన్ని ఎవరూ మరచిపోరు. తన చివరి సందేశంలో కూడా ప్రపంచ దేశాలలో శాంతి నెలకొనాలని ఆకాంక్షించారు. పోప్ ఫ్రాన్సిస్ శాంతియుత, దయామయ ప్రపంచాన్ని చూడాలనుకొన్నారు. క్యాథలిక్ క్రైస్తవ సమాజానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానని శ్రీ పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
Share this content:
Post Comment