జనసైనికుల కుటుంబానికి మనోధైర్యాన్నిచ్చిన జనసేన నాయకులు
సత్యసాయి జిల్లా, పెనుగొండ నియోజకవర్గం, గోరంట్ల మండలం కమ్మలవాండ్లపల్లి గ్రామానికి చెందిన జనసేన పార్టీ కార్యకర్త సోము, బాలు, ద్విచక్ర వాహనంలో ప్రమాదవశాత్తు మరణించగా శనివారం పెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో పెనుకొండ నియోజకవర్గ నాయకులు కుమార్, రాజేష్, పెనుకొండ మండల కన్వీనర్, మహేష్ వారి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించి జనసేన పార్టీ మీకు ఎల్లవేళలా అండగా ఉంటుందని ధైర్యం చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు కుమార్ రాజేష్, మండల్ కన్వీనర్ మహేష్ పెనుకొండ జనసేన పార్టీ సీనియర్ నాయకులు బంగారం, హరినాయక్ యూత్ నాయకులు మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/11/WhatsApp-Image-2022-11-05-at-13.43.27-576x1024.jpeg)