వైసిపి పాలనలో శిలాపలకానికే పరిమితం- అభివృద్ధికి నోచుకోని జడ్.భావరం

కాకినాడ రూరల్ నియోజకవర్గం: కరప మండలం జడ్.భావరం గ్రామంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కాకినాడ ప్రధమ మేయర్ శ్రీమతి పోలసపల్లి సరోజ, తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు శ్రీమతి పిల్లి అనంతలక్ష్మిసత్యనారాయణ మూర్తి ఏడవ రోజు ఇంటింటికి పర్యటన చేశారు. ఈ సందర్బంగా నియోజకవర్గ ప్రజలు అక్కడి ఇబ్బందులను వివరించారు. అధికారంలోకి వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా అభివృద్ధికి నోచుకోని జడ్.భావరం ని చూసి వైసిపి పాలనలో అభివృద్ధి అనేది శిలాపలకానికే పరిమితం అయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి, అక్రమాల కొలువైన ఈ ప్రభుత్వాన్ని గద్దె దించే దిశగా ప్రజలు ఎదురుచూస్తున్నారు. రాబోయే జనసేన-తెలుగుదేశం సంకీర్ణ ప్రభుత్వంలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందనీ, ప్రజలకు కావాల్సిన కనీస అవసరాలు సత్వరమే అందుతాయని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.