ఘనంగా జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
ఎమ్మిగనూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఆధ్వర్యంలో స్థానిక భవిత మానసిక దివ్యాంగుల కేంద్రం నందు కేక్ కటింగ్ నిర్వహించారు. అనంతరం పిల్లలకు బిస్కెట్లు బ్రేడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు రాహుల్ సాగర్, కరణం రవిలు మాట్లాడుతూ జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కల్మషం లేని పిల్లల మధ్య జరుపుకోవడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని దివ్యాంగులు అంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి ఎంతో ఇష్టమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో షబ్బీర్, వినయ్, వెంకటేష్, రమేష్, తదితరులు పాల్గొన్నారు.
![](https://sritvtelugu.com/wp-content/uploads/2024/03/WhatsApp-Image-2024-03-14-at-13.42.32-1024x576.jpeg)