ఏలూరులో ఘనంగా 11 వ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ఏలూరు నియోజకవర్గంలో 11 వ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధికార ప్రతినిధి, ఏలూరు జనసేన ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు ఆధ్వర్యంలో ఏలూరు పార్టీ కార్యాలయంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళల సమక్షంలో జనసేన పతాక ఆవిష్కరణ చేసి వేడుకగా ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు..ఈ వేడుకకు ముఖ్య అతిథిగా ఉభయగోదావరి జిల్లాల సమన్వయకర్త బీ.వి.రాఘవయ్య చౌదరి హాజరయ్యారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పల నాయుడు మాట్లాడుతూ జనసేన పార్టీ 11 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తరపున జనసైనికులకు, వీర మహిళలకు, జనసేన పార్టీ నాయకులకు ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. 2014లో ఈ రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ రాజకీయంలో పెను మార్పు రావాలనీ ఆలోచనతో జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ స్థాపించారు. పవన్ కళ్యాణ్ ఆశయాలకు సిద్ధాంతాలకు అనుగుణంగా పార్టీలో ప్రతి ఒక్కరూ పార్టీకి కష్టపడతామని ఆయన తెలియజేశారు. పార్టీని మరింత బలోపేతం చేయాలని కోరారు. రాజకీయంలో పెను మార్పు జరగాలని, కొన్ని కొన్ని మార్పులు జరుగుతాయి అయినప్పటికీ పవన్ కళ్యాణ్ ఆశయం కోసం సిద్ధాంతాల కోసం పనిచేయాలని కార్యకర్తలను సూచించారు. భావితరాల బంగారు భవిష్యత్తుకై ఎన్నో కష్టనష్టాలను ఓర్చుకొని పోరాడుతున్న అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. జనసేన పార్టీ యొక్క ఉన్నత ఆశయాలను నిలబెడతామని ఈ సందర్భంగా తెలిపారు. రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ దేశ రాజకీయాల్లో పలు పెను మార్పులు తీసుకు రానున్నారని తెలిపారు. దశ దిశ నిర్మించి ఆయన మరింత ఉన్నతంగా ఎదగాలని మేమంతా కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి ఓబిలిశెట్టి శ్రావణ్ గుప్తా, నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్, ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, ఫ్యాన్స్ ప్రెసిడెంట్ దోసపర్తి రాజు, అధికార ప్రతినిధి అల్లు చరణ్, కార్యదర్శులు కందుకూరి ఈశ్వరరావు, ఎట్రించి ధర్మేంద్ర, మీడియా ఇంచార్జీ జనసేన రవి, కోశాధికారి పైడి లక్ష్మణరావు, నాయకులు బోండా రాము నాయుడు, వీరంకి పండు, తుమరాడ రమణ, నిమ్మల శ్రీను, సురేష్, బాబు, నూకల సాయి, సోంబాబు తదితరులు పాల్గొన్నారు.