కొనసాగిన పవనన్న ప్రజా బాట 120వ రోజు
- రాజంపేట జనసేన పార్టీ అసెంబ్లీ ఇంచార్జ్ మలిశెట్టి వెంకటరమణ
రాజంపేట నియోజకవర్గం: జనసేన పార్టీ అసెంబ్లీ ఇంచార్జ్ మలిశెట్టి వెంకటరమణ ఆధ్వర్యంలో రాజంపేట పట్టణంలోని ఈడికి పాలెం, మార్కెట్ లలో శనివారం 120వ రోజు పవన్ అన్న ప్రజా బాట కార్యక్రమాన్ని నిర్వహించి జనసేన పార్టీ రూపొందించిన మేనిఫెస్టోను జనసేన పార్టీ గాజు గ్లాస్ గుర్తును ప్రజల్లోకి తీసుకెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా మలిశెట్టి వెంకటరమణ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు అండగా నిలుస్తున్నారని పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయితే మన రాష్ట్రం బాగుపడుతుందని మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర చేనేత కార్యదర్శి రాటాల రామయ్య, జనసేన నాయకులు భాస్కర్ పంతులు, లీగల్సేల్ ఉపాధ్యక్షుడు కత్తి సుబ్బరాయుడు, ఆచారి, గోపి, గోవర్ధన్, కిషోర్, జనసేన వీరమహిళలు జడ్డ శిరీష, మాధవి తదిరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/11/WhatsApp-Image-2023-11-04-at-6.15.24-PM-1024x768.jpeg)