జనసేన ప్రజా చైతన్య యాత్ర 12వ రోజు
బొబ్బిలి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు, వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ లక్షంగా, విజయనగరం జిల్లా, బొబ్బిలి నియోజకవర్గం ఇంచార్జ్ డా.గిరాడ అప్పలస్వామి జనసేన ప్రజా చైతన్య యాత్రలో భాగంగా “ఆంధ్రా జనం – పోయాం మోసం” అనే కార్యక్రమాన్ని 12వ రోజు బొబ్బిలి మండలం పిరిడి & కుమంధానపేట గ్రామ జనసైనికులు జగన్ అండ్ టీం ఆహ్వానం మేరకు గ్రామంలో ఇంటింటా ప్రచారం చేసి, జగన్ ఆధ్వర్యంలో కొంతమంది యువత, బొబ్బిలి నియోజకవర్గం ఇంచార్జ్ డ్ర్.గిరాడ అప్పలస్వామి సమక్షంలో పార్టీలో చేరడం జరిగింది. జనసేన పార్టీని బలోపేతం చేసే దిశగా పార్టీని ముందుకు నడిపిస్తూ, ప్రజల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కరానికి హామీ ఇస్తూ, ప్రభుత్వంపై పోరాటానికి కార్యాచరణ రూపొందిస్తూ ముందుకు వెళ్తున్నారు. ఈ కార్యక్రమంలో పిరిడి జనసైనికులు, ఐటి వింగ్ మెంబెర్ సతీష్, కుమంధానపేట జనసైనికులు మరియు బొబ్బిలి నియోజకవర్గ జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/04/WhatsApp-Image-2023-04-23-at-12.02.30-1024x459.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/04/WhatsApp-Image-2023-04-23-at-12.02.38-1024x460.jpeg)