జనసేన జనజాగృతి యాత్ర 14వ రోజు

  • గ్రామ గ్రామానా జనసేన ప్రభంజనం
  • గ్రామ గ్రామానా తేనిటీ విందు
  • నల్లగొండ గడ్డా జనసేన అడ్డాగా మరింది

రాజానగరం నియోజకవర్గం, సీతానగరం మండలం, నల్లగొండ గ్రామంలో 14 వ రోజు జనజాగృతి యాత్ర కార్యక్రమం ప్రజల ఆదరణతో ముందుకుసాగుతుంది. రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ మేడ గురుదత్ ప్రసాద్ ఆధ్వర్యంలో అయన అదేశాల మేరకు సీతానగరం మండలం జనసేన పార్టీ అధ్యక్షులు కారిచర్ల విజయ్ శంకర్ అధ్యక్షతన వైస్ ప్రెసిడెంట్ కాతా సత్యనారాయణ, వీరమహిళ కందికట్ల అరుణ కుమారి, చిడిపి నాగేష్, దుబాయ్ శ్రీను, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాలను, సిద్ధాంతాలను గ్రామంలోని ప్రజలకు వివరిస్తూ… జనసేన పార్టీ గుర్తు అయిన గ్లాజు గ్లాసుతో తేనిటీని ఇవ్వడం జరిగింది. దానికి ప్రజలందరూ సహకరించి ఈసారి జనసేన పార్టీని ఆశీర్వదించాలని, పవన్ కళ్యాణ్ కి ఒక అవకాశం ఇచ్చి జనసేన ప్రభుత్వాన్ని స్థాపించాలని, నల్లగొండ గ్రామంలో ప్రతి ఒక్కరిని అభ్యర్థిస్తూ జనసేన షణ్ముఖ వ్యూహం ముద్రించిన కరపత్రాలు పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున వీర మహిళలు, జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.