కొత్త వారి పల్లెలో ప్రతి ఇంటికి జనసేన 15వ రోజు
అన్నమయ్య జిల్లా, మదనపల్లె నియోజకవర్గం ప్రతి ఇంటికి జనసేన కార్యక్రమం 15 వరోజు మదనపల్లె జనసేన నాయకులు శ్రీరామ రామాంజనేయులు ఆధ్వర్యంలో మదనపల్లి జనసేన సీనియర్ నాయకులు దారం హరిప్రసాద్, ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీమతి దారం అనిత అధ్యక్షతన గురువారం కొత్తవారి పల్లెలో జరిగింది. స్థానికులు మరియు జనసేన నాయకులు సాదరంగా ఆహ్వానించి బాణాసంచా కాల్చి కొత్త వారి పల్లె జనసేన నాయకులు, స్థానికులు స్వాగతం పలకడం జరిగింది. ప్రచారంలో భాగంగా వెళ్ళినప్పుడు కొత్తవారిపల్లిలో ఆంజనేయ స్వామి గుడి నిర్మాణంలో ఉందని ఈ యొక్క ఆలయం గోపురానికి సహకరించాలని స్థానిక ప్రజల కోరగా గోపురానికి అయ్యే ఖర్చు భరిస్తానని శ్రీరామ రామాంజనేయులు కొత్తపల్లి ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మదనపల్లి జనసేన నాయకులు ధరణి, తొక్కోల శివ ప్రసాద్, మల్లికార్జున, మదనపల్లి జనసేన సీనియర్ నాయకురాలు శ్రీమతి మల్లికా కొత్తపల్లి పంచాయతీ జనసేన నాయకులు ముఖేష్, గంగాధర, వెంకటేష్, నందు, సిద్దు, మహేష్ బాబు, అశోక్, గణేష్, కిట్టు విశ్వనాథ్, రవి, భాను, సోము మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/11/WhatsApp-Image-2023-11-03-at-08.03.44-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/11/WhatsApp-Image-2023-11-03-at-08.03.43-1024x682.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/11/WhatsApp-Image-2023-11-03-at-08.03.44-1-1024x768.jpeg)