జనచైతన్య శంఖారావం 17వ రోజు

రాజమండ్రి రూరల్, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల ఆలోచనలు మేరకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ తలపెట్టిన జన చైతన్య శంఖారావం 17వ రోజు ధవళేశ్వరం గ్రామం ఎర్ర కొండ ప్రాంతం నుంచి ప్రారంభించడం జరిగింది. ఈ ప్రాంతంలో అడుగడుగునా సమస్యలను స్థానిక ప్రజలు విన్నవించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా దుర్గేష్ మాట్లాడుతూ అతి తొందరలోనే మీ సమస్యలన్నీ తీర్చుతామని దానికి తగ్గట్టుగా ప్రణాళికను సిద్ధం పరుస్తానని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజమండ్రి రూరల్ మండల ప్రెసిడెంట్ చప్పా చిన్నరావు, మేక సత్యనారాయణ, మచ్చర్ల అప్పారావు, వాన నారాయణ, ఆవల శివ, మట్టపర్తి నాగరాజు, కుడుపూడి వెంకటేష్, సిద్ధార్థ, జిల్లా కార్యదర్శి బీర ప్రకాష్, జిల్లా కార్యదర్శి అమీనా, దూది సాయి, సికోటి శివాజీ, శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.