జనసేనాని స్పూర్తితో మాజీ మేయర్ పోలసపల్లి సరోజ 2 లక్షల విరాళం

కాకినాడ, రైతులకు అండగా జనసేన పార్టీ నుండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 5 కోట్ల రూపాయలు అందజేయడం జరిగింది. ఆయన స్ఫూర్తితో కాకినాడ ప్రధమ మేయర్, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, శ్రీమతి పోలసపల్లి సరోజ రైతులను ఆదుకునే విధంగా తన వంతు బాధ్యతగా జనసేన పార్టీకి 2 లక్షల రూపాయలు ప్రకటించడం జరిగింది.