జంగాల పేటలో జనంతో జనసేన కార్యక్రమం 21 వ రోజు
ఆమదాలవలస నియోజవర్గంలో జనంతో జనసేన కార్యక్రమం 21వ రోజు జంగాల పేట గ్రామంలో జనసేన పార్టీ నాయకులు కొత్తకోట నాగేంద్ర, కోరుకొండ మల్లేశ్వరరావు, అంపిలి విక్రమ్(ఎంపీటీసీ) నాయకులు మరియు కొల్ల జయరామ్ ఆధ్వర్యంలో కొణిదెల పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో జనంతో జనసేన కార్యక్రమంలో భాగంగా 21వ రోజు నిర్వహించడం జరిగింది. జంగాల పేట గ్రామంలో ప్రతి ఇంటింటికి వెళ్లి జనసేన సిద్ధాంతాలను మరియు రాష్ట్రంలో ఉన్న సమస్యలను ప్రజలకి అర్థమయ్యే విధంగా చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరి జీవితాలు బాగుండాలి, యువత అందరూ కి కూడా జాబులు రావాలి, మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే భవిష్యత్తులో వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీని ఆదరించి, గాజు గ్లాస్ గుర్తుకి ఓటు వేసి, జనసేన పార్టీని గెలిపించవలసిందిగా ప్రతి ఒక్కరిని పేరుపేరునా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కొత్తకోట శ్రీనివాసరావు, సైరుగాపు సంతోష నాయుడు, తిరుపతి, మోహన్, జగదీష్, సాయి మరియు జనసేన కార్యకర్తలు, జంగాల పేట గ్రామ ప్రజలు పాల్గొని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరినీ పేరు పేరునా ధన్యవాదాములు తెలిపారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/10/WhatsApp-Image-2022-10-02-at-21.22.44-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/10/WhatsApp-Image-2022-10-02-at-21.22.44-1-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/10/WhatsApp-Image-2022-10-02-at-21.22.45-1024x768.jpeg)