చేపెనపేట గ్రామంలో జనంతో జనసేన 25వ రోజు
ఆమదాలవలస నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కొత్తకోట నాగేంద్ర, కోరుకొండ మల్లేశ్వరరావు, అంపిలి విక్రమ్(ఎంపీటీసీ) నాయకులు మరియు కార్యకర్తలు ఆధ్వర్యంలో కొణిదెలు పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో జనంతో జనసేన కార్యక్రమంలో భాగంగా 25వ రోజు, ఆమదాలవలస మండలం, సేపన్నపేట, బుడితి పేట, సూరపనాయుడు పేట గ్రామాలలో ప్రధాన సమస్య రోడ్లు సరిగా లేకపోవడం మరియు స్కూలు, అంగన్వాడి భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి, పెచ్చులూడి పిల్లల మీద ఎప్పటికప్పుడు పడుతున్నాయి, స్లాబు మీద పడిపోతుంది ఏమో అని, పిల్లలు భయభ్రాంతులకు గురవుతూ, చదువులు కొనసాగిస్తున్నారు. ఈ సమస్య పరిష్కారం అయ్యేంతవరకు జనసేన పోరాటం చేస్తుందని గ్రామ ప్రజలకు భరోసా కల్పించడం జరిగింది. మరియు ప్రతి ఇంటింటికి వెళ్లి జనసేన సిద్ధాంతాలను తెలియజేయడం జరిగింది. ప్రతి ఒక్కరి జీవితాలు బాగుండాలి, యువత అందరికి కూడా జాబులు రావాలి, మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే భవిష్యత్తులో వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీని ఆదరించి, గాజు గ్లాస్ గుర్తుకి ఓటు వేసి, జనసేన పార్టీని గెలిపించవలసిందిగా ప్రతి ఒక్కరిని పేరుపేరునా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు ధూబ సంగం నాయుడు, సైరుగాపు సంతోష నాయుడు, కొత్తకోట శ్రీనివాస్, జయరాం, చేపెన మన్మధరావు, చేపెన కోటేశ్వరరావు, చేపెన సోమేశ్వరరావు, గంటేన రామ్మోహన్, చేపెన గోపాల్ మరియు జనసేన కార్యకర్తలు, మరియు మూడు గ్రామలు ప్రజలు పాల్గొని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరినీ పేరు పేరునా ధన్యవాదాములు తెలియజేసుకుంటున్నామని తెలిపారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/10/WhatsApp-Image-2022-10-14-at-17.27.01-768x1024.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/10/WhatsApp-Image-2022-10-14-at-17.27.01-1-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/10/WhatsApp-Image-2022-10-14-at-17.27.04-1024x768.jpeg)