కందుల నాగరాజు ఆధ్వర్యంలో పవన్ అన్న ప్రజా బాట 27వరోజు
విశాఖ, దక్షిణ నియోజకవర్గం నాయకులు, 32వ కార్పొరేటర్, డాక్టర్ కందుల నాగరాజు ఆధ్వర్యంలో పవన్ అన్న ప్రజా బాట 27వరోజు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ తిరుగుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను మరియు జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు వివరిస్తూ రాబోయే ఎన్నికలలో గాజుగ్లాసుకు ఓటు వేసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిని చేయాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/04/WhatsApp-Image-2023-04-17-at-20.58.08.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/04/WhatsApp-Image-2023-04-17-at-20.58.09-1.jpeg)