జనంకోసం జనసేన 316వ రోజు

  • వనరక్షణలో భాగంగా 700 మొక్కల పంపిణీ

జగ్గంపేట, జనంకోసం జనసేన 316వ రోజులో భాగంగా జనసేన వనరక్షణ మొక్కల పంపిణీ కార్యక్రమం జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర ఆధ్వర్యంలో గోకవరం మండలం, కొత్తపల్లి గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా సోమవారం 700 మొక్కలు పంచడం జరిగింది. నేటి వరకు నియోజకవర్గం మొత్తంగా 77595 మొక్కలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గండేపల్లి మండల సంయుక్త కార్యదర్శి కారుకొండ విజయ్ కుమార్, కొత్తపల్లి నుండి గ్రామ అధ్యక్షులు సోలా అంజిబాబు, పువ్వల శ్రీదేవి, వేముల దేవి, వేముల రమణ మూర్తి, మాదారపు ధర్మేంద్ర, మాదారపు విక్రమ్, వనుం నరేష్, గౌతు జయశంకర్, నాయుడు ఈశ్వర్, గోపీసెట్టి వీరబాబు, పువ్వల రాజు, గాదం సూరి, పువ్వల హిమవీర్, వనం ప్రదీప్, మాదారపు బాల సుబ్రహ్మణ్యం, వేముల సురేష్, గాదం సూర్య శివ, దిండి వెంకటేశ్వరరావు, కామరాజుపేట నుండి జాజుల అశోక్, గోనేడ నుండి నల్లంశెట్టి చిట్టిబాబు, వల్లభశెట్టి నాని, బూరుగుపూడి నుండి కోడి గంగాధర్ లకు జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర కృతజ్ఞతలు తెలియజేసారు. జనంకోసం జనసేన కార్యక్రమంలో భాగంగా సోమవారం కొత్తపల్లి గ్రామంలో ఎంతో ప్రేమానురాగాలతో ఆతిథ్యం అందించిన పువ్వల శ్రీదేవి కుటుంబ సభ్యులకు హృదయపూర్వక జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర కృతజ్ఞతలు తెలియజేసారు.